'విన‌య విధేయ రామ' టాకీ పార్ట్ పూర్తి... 2019 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న  చిత్రం `విన‌య విధేయ రామ‌`. డి.పార్వ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత దాన‌య్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, స్నేహ, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాణంగా న‌టిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. డిసెంబ‌ర్ 10 నుండి హైద‌రాబాద్‌లో భారీ సెట్‌లో ఓ పాటను చిత్రీక‌రించ‌బోతున్నారు. 

ఈ సంద‌ర్భంగా...

అగ్ర‌ నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ - ``క్రేజీ కాంబినేష‌న్ మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో టైటిల్‌ను `విన‌య విధేయ రామ‌` అని అనౌన్స్ చేయ‌గానే చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌ల చేసిన టీజ‌ర్‌ను ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా విష‌యానికి వ‌స్తే.. టాకీ పార్ట్ పూర్త‌య్యింది. హైద‌రాబాద్‌లో భారీ సెట్‌ను వేసి అందులో డిసెంబ‌ర్ 10 నుండి ఓ సాంగ్‌ను పిక్చ‌రైజ్ చేయ‌బోతున్నాం. ఆల్ రెడీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి 2019 సంక్రాంతి కానుక‌గా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.