సినీనటి విజయనిర్మల కన్నుమూత

అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల (73) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. నగరంలోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆమె గతకొంతకాలంగా చికిత్సపొందుతున్నారు. విజయనిర్మల మరణంతో తెలుగు సినీ పరిశ్రమ శోఖసంద్రంలో మునిగిపోయింది. ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ఆమె మరణం టాలీవుడ్కు తీరని లోటంటూ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అరుదైన ర్శ టీమణి విజయనిర్మ ఠాన్మణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. విజనిర్మ న్నుమూయడం ఎంతో బాధాకరమని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. హీరో ఎన్టీఆర్ ట్విటర్ ద్వారా సంతాపాన్ని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అంటూ  కృష్ణ అల్లుడు, హీరో సుధీర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. నటి, నిర్మాత మంచు లక్ష్మీ విజయ నిర్మల మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఎన్నో అద్భుత విజయాలను సాధించారు. సంపూర్ణ జీవితం అనుభవించిన ఆమె ఆత్మకు శాంతి చేకూరలని ఆశిస్తున్నాను’. అంటూ ట్వీట్ చేశారు.

మరిన్ని కథనాలు

ఈ నగరానికి ఏమైంది...
న్యూయార్క్ లో...
‘ఈ నగరానికి...
విజువ‌ల్ వండ‌ర్ గా...
మే 18న జీఏ 2 మరియు యువి పిక్చర్స్, విజయ్ దేవరకొండ "టాక్సీవాలా" వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
మే 18న జీఏ 2 మరియు...
ఎలిమినేషన్ టాస్క్...